వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ ఓదార్పులో ఎస్పీఎస్ నెల్లూరు టిడిపి ఎమ్మెల్యే నల్లపురెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
నెల్లూరు: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన కొవురు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మంగళవారం పాల్గొన్నారు. నల్లపురెడ్డి మర్రిపాడు మండలంలో జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొన్నాడు. కంపసముద్రంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జగన్ ఓదార్పు మంగళవారంతో ఏడవ రోజుకు చేరుకుంది.

కొవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అధిష్టానంపై పలుమార్లు విరుచుకు పడ్డారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీరు మారాలని చాలాసార్లు బాహాటంగా అన్నారు. ఇటీవల నల్లపురెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్ ఓదార్పు వ్యక్తిగతంగా పార్టీలకతీతంగా చేస్తున్నదని, కాబట్టి ఎవరైనా పాల్గొనవచ్చునన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించాలని జగన్ అనుకోవటం చాలా మంచి విషయమని అభినందించారు. అంతే కాకుండా నెల్లూరులో జగన్ ఓదార్పు చేపడితే పాల్గొంటానని కూడా బాహాటంగానే ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X