గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైకోర్టు బెంచ్ కోసం కలెక్టరేట్ ను ముట్టడించిన సీమాంధ్ర లాయర్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

High Court
గుంటూరు:సీమాంధ్ర ప్రాంతంలోని గుంటూరు - విజయవాడల మధ్య హైకోర్టు బెంచ్‌ కోసం ఉద్యమం చేస్తున్న న్యాయవాదులు తమ ఆందోళన తీవ్రతరం చేశారు. గుంటూరు-విజయవాడల మధ్య బెంచ్‌ ఏర్పాటుపై ప్రభుత్వం కచ్చితమైన ప్రకటన చేయాలంటూ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు బుధవారం జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. న్యాయవాదులు కలెక్టర్‌ కార్యాలయ ప్రధాన గేట్లకు తాళం వేసేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

ఆగ్రహించిన న్యాయవాదులు కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు ఆందోళన విరమించమని ఎంతగా చెప్పిన వినలేదు. తమకు బెంచ్ పై స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని చెప్పారు. దీంతో పోలీసులు పలువురు న్యాయవాదులను అరెస్టు చేశారు. కాగా ఈ నెల 22వ తేదిన ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గుంటూరు జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో న్యాయవాదులు తమ ఆందోళనను తీవ్రతరం చేయాలని నిర్ణయించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X