హైకోర్టు బెంచ్ కోసం కలెక్టరేట్ ను ముట్టడించిన సీమాంధ్ర లాయర్లు
ఆగ్రహించిన న్యాయవాదులు కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు ఆందోళన విరమించమని ఎంతగా చెప్పిన వినలేదు. తమకు బెంచ్ పై స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని చెప్పారు. దీంతో పోలీసులు పలువురు న్యాయవాదులను అరెస్టు చేశారు. కాగా ఈ నెల 22వ తేదిన ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గుంటూరు జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో న్యాయవాదులు తమ ఆందోళనను తీవ్రతరం చేయాలని నిర్ణయించారు.
Comments
Story first published: Wednesday, October 20, 2010, 15:11 [IST]