వైయస్ జగన్ ఓదార్పు యాత్రతో పార్టీకి నష్టం లేదు: రోశయ్య

Rosaiah
బెంగళూరు: ఓదార్పు యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టంలేదని ముఖ్యమంత్రి కె.రోశయ్య స్పష్టం చేశారు. తెలుగు సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం తనకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కడప ఎంపి జగన్మోహన రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడని, అతనికి మంచి భవిష్యత్ ఉందన్నారు. ఓదార్పు యాత్ర జగన్ వ్యక్తిగతమని, దాని గురించి అధిష్టానంతో జగన్ మాట్లాడినట్లున్నాడని చెప్పారు. పదవులు, హోదాలతో కాకుండా నన్ను నన్నుగా గుర్తించాలని ఆంధ్రప్రదేశ్‌ రోశయ్య విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన బెంగళూరులో ఆర్యవైశ్య సంఘం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చానని, ఎన్నికల్లో విజయం సాధించినా, పార్టీలో పనిచేసినా ఏ బాధ్యతను స్వీకరించినా స్థాయి, అంతస్తులతో ఉన్నతుడ్ని అన్న అధికారం తలకెక్కలేదని, అలా ఉండకూడదనే మనసారా కోరుకుంటానని, ముఖ్యమంత్రి బాధ్యతను ఎలాంటి పరిస్థితుల్లో చేపట్టానో తెలిసిందేనని, అధిష్ఠానం ఆదేశాన్ని క్రమశిక్షణ కలిగిన సైనికుడిలా అంగీకరించానని ఆయన అన్నారు.

తన కంటే ఉన్నతులు, అనుభజ్ఞులు పార్టీలో లేరని కాదని, పార్టీ ఆదేశాన్ని శిరసావహించడమే కర్తవ్యంగా భావించానని అన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల నడుమ చాలా సంబంధాలున్నాయని, సంస్కృతిలో సారూప్యత ఉందన్నారు. ఆర్య వైశ్య్లులు రాజకీయాల్లో కూడా ఆసక్తిని పెంపొందించుకోవాలిని, కులబలం తక్కువగా ఉన్నందున ఐక్యత ఎంతైనా అవసరమని, మంచి చేసేవారిని ప్రోత్సహించాలని అన్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్యను కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ, కేంద్ర మంత్రి స్థితప్రజ్ఞుడిగా ప్రశంసించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+