జయప్రద, అమర్ సింగ్ విజ్ఞప్తిపై ఎజి సలహా అడిగిన సుప్రీంకోర్టు

పార్టీ విప్ ను పాటించనందుకు 1996 తీర్పు నేపథ్యంలో తమను పార్లమెంటు సభ్యులుగా ఆనర్హులుగా ప్రకటించే అవకాశం ఉందనే భయంతో వారు సుప్రీంకోర్టుకు ఎక్కారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం బహిష్కరణ తర్వాత కూడా సభ్యుడు లేదా సభ్యురాలు ఆ పార్టీ నియంత్రణలోనే ఉంటారని 1996లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తమను బహిష్కరించినందున తమను వేరే శక్తిగా ఎందుకు గుర్తించకూడదో తెలపాలని, వేరే పార్టీ ఎందుకు పెట్టుకోకూడదో కూడా చెప్పాలని జయప్రద, అమర్ సింగ్ సుప్రీంకోర్టును కోరారు. సమాజ్ వాదీ పార్టీ నాయకత్వం తమను అశ్రద్ధ చేసిందని వారు విమర్శించారు.












Click it and Unblock the Notifications