వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ కాంగ్రెసు నాయకులకు శత్రువే
కాంగ్రెసు సీనియర్ నాయకులు కె కేశవరావు, వి హనుమంతరావులపై విజయవాడ కాంగ్రెసు నేతలు మల్లాది విష్ణు, జోగు రమేష్ చేసిన వాఖ్యలు దారుణమని తెలంగాణ కాంగ్రెసు కార్యాచరణ సమితి మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో పేర్కొన్నది. వారిపై అధిష్టానానికి తెలంగాణ సంస్మరణ సభ శత్రువులను సన్మానించడానికి ఏర్పాటు చేసింది కాదని వారు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. మహబూబాబాద్ సభ కూడా తెలంగాణ అమరవీరుల కోసం ఏర్పాటు చేసిన సభ అని కానీ తెలంగాణ వ్యతిరేకులు, శత్రువులకు ఏర్పాటు చేసిన సభ కాదని అన్నారు.
తెలంగాణ మంత్రులు ఎక్కడ కూడా నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొనరాదని తెలంగాణ కాంగ్రెసు కార్యాచరణ సమితి ఆల్టిమేటం జారీ చేసింది. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ మంత్రులందరూ తప్పకుండా పాల్గొనాలని నిర్బంధంగా వ్యవహరించటం లేదన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు కాంగ్రెసు అనుకూలంగా ఉందని తెలియపర్చడానికి మంత్రులు వేడుకలకు దూరంగా ఉండాలని కోరారు.