వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో పాల్గొంటా: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Komatireddy Venkat Reddy
నల్గొండ: నవంబర్ 1వ తేదిన ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవంలో తాను తప్పకుండా పాల్గొంటానని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నల్గొండజిల్లాలోని పానగల్లు సెంటర్లో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి మంత్రి కోమటిరెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

డిసెంబర్‌ 31 తరువాత కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుంటే మొదటగా తానే రాజీనామా చేస్తానని అన్నారు. ఆ సమయంలో తనతో కలిసి రానివారిపై కొరడా తప్పదని హెచ్చరించారు.శ్రీకృష్ణ కమిటీ నివేదిక గురించి అందరూ వేచి చూస్తున్నారని, దానికి ఇక రెండునెలలే సమయముందని ఆయితే అప్పుడు ఎందరు తనతో కలిసి వస్తానో చూస్తానని సవాల్ విసిరారు. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నప్పుడు ఉత్సవాలలో పాల్గొనవలసిన బాధ్యత మాపై ఉందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X