తూర్పు గోదావరి జిల్లా రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
Districts
oi-Pratapreddy
By Pratap
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంక వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో చిన్నారి సహా ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. డివైడర్ ను ఢీకొని కారు బోల్తా పడడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
అన్నవరం దైవదర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి వాసులుగా గుర్తించారు. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.