వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం కొర్రీ, రాష్ట్రానికి లేఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

Ponnala Laxmaiah
న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ లేఖ రాసింది. ఒడిషా, ఛత్తీస్‌ గఢ్ ‌లో కరకట్టలు కట్టే ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు చేయలేదని కేంద్రం ప్రశ్నించింది. 10 రోజుల్లోగా దీనికి సంబంధించి వివరణ ఇవ్వకపోతే షోకాజ్‌ నోటీసు జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం హెచ్చరించింది. దీన్ని బట్టి పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం కొర్రీ వేసినట్లే కనిపిస్తోంది.

కాగా, పోలవరం ప్రాజెక్టు విషయంలో రాజీ పడేది లేదని ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. వివరణ కోసం తమకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిన విషయం తనకు తెలియదని, అలా రాసి ఉంటే దురదృష్టకరమని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. గతంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారమే పోలవరం నిర్మాణం జరుగుతోందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X