చంద్రబాబు నాయుడు నోట మళ్లీ నగదు బదిలీ పథకం
మెక్రో ఫైనాన్స్ బాధితులను కూడా తాను పరామర్శిస్తానని ఆయన చెప్పారు. మైక్రో ఫైనాన్స్ ఆగడాలకు జిల్లాలో ఐదారుగురు మృత్యువాత పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజీవ్ గృహ కల్ప పథకం కోసం ప్రభుత్వం డబ్బులు వసూలు చేసిందని, చాలా వరకు నిర్మాణాలే జరగలేదని, జరిగిన నిర్మాణాలు కూడా ప్రమాణాల మేరకు లేవని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం అవినీతికి, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆయన విమర్శించారు. వరద బాధితులను ఆదుకోవాల్సిందిగా ఆయన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కోస్తాంధ్ర నాయకులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Comments
చంద్రబాబు నాయుడు తెలుగుదేశం రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ chandrababu naidu telugudesam rangareddy district hyderabad
Story first published: Tuesday, November 2, 2010, 10:51 [IST]