హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఎసరు: పిఆర్పీ నేత చిరంజీవికి షాక్

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: గోదావరి నదిపై రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి కాంగ్రెసు నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చేందుకు సిద్ధపడినట్లు ప్రచారం జరుగుతోంది. చత్తీస్ గడ్, ఒడిషాల్లో కరకట్టల నిర్మాణంపై ప్రజాభిప్రాయం సేకరించలేదని కొర్రీ పెడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీన్ని బట్టి పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం పెండింగులో పెట్టాలని భావిస్తోందనే అనుమానం కలుగుతోంది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ చిరంజీవి ఉభయ గోదావరి జిల్లాల్లో యాత్ర చేపట్టారు. చిరంజీవి డిమాండ్ కు అప్పట్లో ప్రధాని మన్మోహన్ సింగ్ అంగీకరించినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇదే సమయంలో కాంగ్రెసుతో పొత్తుకు చిరంజీవి సిద్ధపడ్డారు.

పోలవరం ప్రాజెక్టును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ పర్యావరణ మంత్రి జైరాం రమేష్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపారు. పోలవరం ప్రాజెక్టు వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని కేంద్ర పర్యావరణ శాఖ అభిప్రాయపడింది. పోలవరం ప్రాజెక్టు కోసం ఉద్యమం చేసి సాధించానని చెప్పుకుంటూ వస్తున్న చిరంజీవికి అది పెద్ద షాకే అవుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X