వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోశయ్యను మైక్రో ఫైనాన్స్ రాద్ధాంతపై ప్రశ్నించిన రాహుల్ గాంధీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
న్యూఢిల్లీ: రాష్ట్రంలో జరుగుతున్న మైక్రో ఫైనాన్స్ సంస్థల రాద్ధాంతంపై కాంగ్రెసు యువ నేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి కె. రోశయ్యను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎఐసిసి సదస్సు సందర్భంగా మంగళవారం 15 నిమిషాల పాటు రాహుల్ గాంధీతో, ఎఐసిసి నాయకులతో రోశయ్య సమావేశమయ్యారు. మైక్రో ఫైనాన్స్ సంస్థల వ్యవహారంపై ఆయన వారికి వివరించినట్లు తెలుస్తోంది. మైక్రో ఫైనాన్స్ సంస్థల వ్యవహారంపై రాహుల్ గాంధీ రోశయ్యతో ఆరా తీశారు. మైక్రో ఫైనాన్స్ సంస్థల వ్యవహారంపై ఇంత రాద్ధాంతం ఎందుకు జరుగుతోందని ఆయన అడిగినట్లు చెబుతున్నారు.

మైక్రో ఫైనాన్స్ సంస్థల బలవంతం పసూళ్లను, ఆగడాలను తట్టుకోలేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యం ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రాహుల్ గాంధీని ప్రత్యేకంగా టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ఎస్కెఎస్ అధిపతి ఆకుల విక్రమ్ రాహుల్ గాంధీతో కలిసి ఫొటో దిగారని, ఆకుల విక్రమ్ కు రాహుల్ తో సంబంధాలున్నాయని, రాహుల్ వల్లనే రాష్ట్రంలో ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X