టార్గెట్ చంద్రబాబు: రాజ్ న్యూస్ లో వరుస వ్యతిరేక కథనాలు

తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు నాగం జనార్ధన్ రెడ్డి, దేవేందర్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు, కడియం శ్రీహరి వంటి వారు తాము తెలంగాణ వాదులమని తెలంగాణ కోసం అన్ని పార్టీలకంటే మాకే తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉందని ప్రకటిస్తూ, బాబ్లీ, ఢిల్లీ యాత్రలు చేపట్టినప్పటికీ రాజ్ న్యూస్ మాత్రం వారి చేసినవన్నీ దొంగనాటకాలుగా ప్రసారం చేస్తూ పార్టీ ఇమేజ్ ని దెబ్బ తీయాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. తెలుగు దేశం చేపట్టిన ఢిల్లీ యాత్ర రాజకీయ కోణంలో చేసిందని చెప్పడానికి రాజ్ న్యూస్ యాత్రకు చంద్రబాబు అనుమతి ఉందా ఆని ప్రశ్నించింది. చంద్రబాబు అనుమతి ఉందంటే బాహాటంగా ప్రకటించమన్నది. అనుమతి గూర్చి టీడీపీ మాట్లాడక పోవటంతో కేవలం దొంగనాటకంగా కథనాలు ప్రసారం చేశారు.
ఇక నవంబర్ 1వ తారీఖున చంద్రబాబునాయుడు తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేయడాన్ని రెండు రోజులుగా నిత్యం ప్రసారం చేస్తోంది. తెలుగు తల్లి విగ్రహానికి బాబు దండవేసి తాను సమైక్యవాదినని బాబు చెప్పకనే చెప్పాడని, నవంబర్ 1కి అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఏ మాత్రం సంబంధం లేకున్నా ఆయనకు దండవేయడం ఏమిటని ప్రశ్నించింది. అమరజీవికి దండ వేయడానికి మదరాసు నుండి ఆంధ్ర విడిపోయిన అక్టోబర్ 1గానీ, అమరజీవి జయంతి, వర్ధంతిగానీ కావని, తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి ఏ సందర్భంలో ఎలా వేయాలో తెలియటం లేదని ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్, ప్రజారాజ్యం, లోక్ సత్తా, సిపిఎం ఉండగా రాజ్ న్యూస్ కేవలం తెలుగు దేశాన్ని, చంద్రబాబునాయుడిని లక్ష్యంగా చేసుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ తెలంగాణ ఇవ్వాలంటే జాతీయ పార్టీలతో వైరుధ్యం ఉన్నప్పటికీ ఆ పార్టీపై కాస్త సంయమనం పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆ పార్టీలో తెలంగాణ కోసం నాలుగు దశాబ్దాలుగా పోరాడుతున్న తెలంగాణ వారూ ఉన్నారు. ఇలాంటప్పుడు కాంగ్రెస్ ను ముట్టుకోవడం సాద్యం కాదు. ఇక తెలంగాణలో ప్రజారాజ్యం బలం పూజ్యం, లోక్ సత్తా తెలంగాణ లోక్ సత్తాగా మారి అధినేతతో విభేదిస్తున్నది. ఇక మిగిలింది తెలుగు దేశం. ఆ పార్టీకి తెలంగాణలో మంచి క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ ను తమవైపు తిప్పుకోవాలంటే చంద్రబాబును తెలంగాణ వ్యతిరేకిగా ప్రచారం చేస్తేగానీ కుదరని రాజ్ న్యూస్ గ్రహించి బాబును టార్గెట్ గా చేసుకన్నదని, అందుకే బాబు పర్యటనలకు అడ్డుకోవడానికి రాజ్ న్యూస్ షాడో కెసిఆర్ తెరాస కార్యకర్తలను ఉసిగొల్పుతున్నాడని కూడా పలువురు భావిస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications