నిజామాబాద్ తహసీల్దారు కార్యాలయంలో మంటలపై అనుమానాలు

Nizamabad
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా తహసీల్దారు కార్యాలయంలో మంటలు రేగి కీలకమైన పత్రాలు దగ్ధమయ్యాయి. తహసీల్దారు, సబ్ ట్రెజరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అందులోని అతిముఖ్యమైన పత్రాలు మంటలకు పూర్తిగా మాడి మసైపోయినయి. కార్యాలయం మొత్తం కాకుండా కేవలం కీలక పత్రాలు ఉన్న గదిలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది.

ఉద్దేశ్యపూర్వకంగానే ఇలా చేసినట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన బుధవారం ఉదయం 6 గంటల సమయంలో జరగటంతో స్థానికులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఇంతకుముందు ఎన్నికల సమయంలో కూడా కీలక పత్రాలు ఉన్న గదిలోనే మంటలు రేగాయి. అప్పుడు కూడా ఇలాగే జరగటం గమనించదగ్గ విషయం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

ఇంతకు ముందు ఈ కార్యాలయంలో ఆర్థిక కుంభకోణం చోటు చేసుకుంది. 70 లక్షల రూపాయలు డ్రా చేసిన సంఘటనలో దాదాపు 30 నుంచి 35 లక్షల రూపాయలకు లెక్కలు తేలలేదు. ఈ అక్రమ వ్యవహారంలో డిప్యూటీ ఎమ్మార్వో సస్పెన్ష్ కు గురయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+