అధిష్టానానికి హెచ్చరిక: నెల్లూరులో వైయస్ జగన్ బలప్రదర్శన

నెల్లూరులో శక్తులన్నీ మోహరించి జగన్ వర్గం బలప్రదర్శనకు సిద్ధపడినట్లు అర్థమవుతోంది. ఈ సభకు పెద్ద యెత్తున ప్రజలు హాజరయ్యారు. జగన్ వర్గానికి చెందిన నాయకులంతా అక్కడ మోహరించారు. కొత్తగా లక్ష్మీపార్వతి, రోజా వచ్చి చేరారు. జగన్ తప్ప మరో నాయకుడు లేడంటూ రోజాతో సహా మిగతా నాయకులంతా ఎలుగెత్తి చాటారు. వైయస్ జగన్ మామూలుగా కాకుండా కాస్తా కటువుగా మాట్లాడారు. ప్రతిపక్షాలను, తన వ్యతిరేక మీడియాను వదిలేసి సొంత పార్టీపైనే నిప్పులు చెరిగారు. తనను ఒంటరి చేయడానికి పార్టీలో కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, హెచ్చరికలు కూడా చేశారు. సహనం కోల్పోయినప్పుడు ఉప్పెన పుడుతుందని ఆయన హెచ్చరించారు. ఇది పార్టీ అధిష్టానానికి హెచ్చరిక పంపడమేనని భావిస్తున్నారు.
పార్టీ అధిష్టానం తనను అంగీకరించే స్థితిలో లేదని తెలిసినా తనను కాదంటే ఎదురయ్యే పరిస్థితి ఏమిటో ఆయన పరోక్షంగా వినిపించదలుచుకున్నారు. అందుకే అలా మాట్లాడారని భావిస్తున్నారు. అధిష్టానాన్ని ధిక్కరించి ఓదార్పు యాత్ర చేపట్టిన వైయస్ జగన్ చాలా స్పష్టంగానే ఉన్నారని అంటున్నారు. పార్టీ పెట్టేందుకు ఆయన సిద్ధపడినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications