Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాశ్మీర్ సమస్య పరిష్కారానికి మేం ఒత్తిడి తేలేదు: బరాక్ ఒబామా

Barack Obama
హైదరాబాద్: కాశ్మీర్ సమస్య పరిష్కారానికి తాము ఏనాడూ ఒత్తిడి తేలేదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. కాశ్మీర్ సమస్యను పాక్, భారత్ శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.కాశ్మీర్ సమస్య పరిష్కారానికి, శాంతి సామరస్యాలకు భారత ప్రధాని అంకిత భావంతో ఉన్నారని ఆయన చెప్పారు. శాంతి కోసం భారత ప్రధాని చిత్తశుద్ధి, అంకిత భావంతో ఉన్నారని ఆయన అన్నారు. కాశ్మీర్ కు తాము శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటున్నామని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద ప్రోత్సాహంపై తమకు నమ్మకం కలిగించాలని ఆయన అన్నారు. హైదరాబాదు హౌస్ లో అమెరికా, భారత ప్రతినిధుల స్థాయి సమావేశానంతరం ఒబామా, మన్మోహన్ సింగ్ సంయుక్త మీడియా ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు. పాకిస్తాన్ సమస్యలను పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని మన్మోహన్ సింగ్ చెప్పారు. పాక్, భారత్ ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇరు దేశాలు అంగీకరించే ఏ పాత్ర పోషించడానికైనా అమెరికా సిద్ధంగా ఉందని ఒబామా అన్నారు.

అమెరికా ఉద్యోగాలను భారతీయులు దొంగలించలేదని, వేగవంతమైన అభివృద్ధికి భారత్ తోడ్పడిందని మన్మోహన్ సింగ్ అన్నారు. అమెరికా నుంచి ఉన్నత సాంకేతిర పరిజ్ఞానాన్ని, పెట్టుబడులను తాము కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. అన్ని రంగాల్లో అమెరికా, భారత్ ల మధ్య పరస్పరం సహకారానికి అవకాశాలున్నాయని తాము గుర్తించామని ఆయన చెప్పారు. సమాన హోదా గల దేశాలుగా కలిసి పనిచేయాలని అమెరికా, భారత్ లు నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. అణు, రక్షణ రంగాల్లో పరస్పరం సహకరించుకుంటామని ఆయన చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని ఆయన చెప్పారు. రక్షణ, సివిల్ రంగాల్లో ఇరు దేశాలు సహకరించుకుంటాయని ఆయన అన్నారు. అణ్వాయుధ వ్యాప్తి నిరోధానికి, ప్రపంచ శాంతికి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. టెక్నాలజీపై ఆంక్షలు తొలిగించినందుకు ఆయన అమెరికాకు అభినందనలు తెలిపారు.

భారత ఆతిథ్యంతో తాము ముగ్ధుడినయ్యానని ఒబామా చెప్పారు. భారత్ కు రావడం తనకు ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. టెర్రరిజం, వాతావరణ మార్పులపై భారత సహకారం అత్యంత కీలకమని ఆయన అన్నారు. భారత, అమెరికా సంబంధాలను మెరుగు పరుచుకోవడానికే తాను భారత్ వచ్చానని ఆయన అన్నారు. తీవ్రవాదాన్ని తాము తరిమి కొడతామని ఆయన చెప్పారు. భారత్ కు తాము అన్ని విధాలుగా ప్రాధాన్యం ఇస్తామని, భారత్ ప్రగతిని తాము స్వాగతిస్తామని ఆయన చెప్పారు. యాంటీలిస్టు నుంచి భారత కంపెనీలను తొలగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+