హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ పై ఒయు జెఎసి మండిపాటు: దిష్టిబొమ్మకు చెప్పు దెబ్బలు

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీని బలోపేతం చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రకటనపై ఉస్మానియా విశ్వవిద్యాలయం ఐక్య కార్యాచరణ కమిటీ (ఒయుజెఎసి) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కెసిఆర్ ప్రకటనను వ్యతిరేకిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు శుక్రవారం ఆందోళనకు దిగారు. కెసిఆర్ దిష్టిబొమ్మను ఊరేగించారు. దిష్టిబొమ్మను చెప్పులతో, రాళ్లతో, కోడిగుడ్లతో కొట్టారు. ఆ తర్వాత దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

కెసిఆర్ ఖబడ్దార్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. కెసిఆర్ తెలంగాణ ద్రోహి అంటూ విమర్శించారు. కెసిఆర్ వల్ల తెలంగాణ రాదని మరోసారి రుజువైందని జెఎసి నాయకులు విమర్శించారు. కెసిఆర్ ప్రకటనపై తెలంగాణవాదులు తీవ్రంగా మండిపడుతున్నారు. తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ కెసిఆర్ కు సలహా ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X