వల్లభనేని వంశీ హత్యకు మద్దెలచెర్వు సూరి, దేవినేని నెహ్రూ కుట్ర?

Vallabhaneni Vamsi
విజయవాడ: తనను చంపేందుకు పరిటాల రవి హత్య కేసు నిందితుడు మద్దెలచెర్వు సూరి, కాంగ్రెసు నాయకుడు దేవినేని నెహ్రూ కుట్ర చేశారని తెలుగుదేశం నాయకుడు వల్లభనేని వంశీ ఆరోపించారు. తన హత్యకు సూరి మనుషులు రెక్కీ చేశారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పరిటాల రవిని చంపినట్లే తనను చంపడానికి కుట్ర చేశారని ఆయన అన్నారు. అందులో భాగంగానే తనకు భద్రతను తగ్గించారని ఆయన అన్నారు. విజయవాడ పోలీసు కమిషనర్ సీతారామాంజనేయులు కాంగ్రెసుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. వంశీని చంపుతామని భాజీ ప్రసాద్ కమిషనర్ ముందే చెప్పారని, అయినా ఏ విధమైన చర్యలూ తీసుకోలేదని ఆయన అన్నారు.

కాగా, వంశీ ఆరోపణలను సీతారామాంజనేయులు ఖండిస్తున్నారు. విజయవాడ పరిధిలో వంశీకి ఏ విధమైన ప్రాణహానీ ఉండదని ఆయన అన్నారు. భద్రత కోసం కాకుండా ఇతర పనులకు వినియోగిస్తుండడం వల్లనే వంశీ గన్ మెన్ ను తగ్గించామని ఆయన అన్నారు. దేవినేని నెహ్రూకు కూడా భద్రత తగ్గించామని ఆయన అన్నారు. వంశీకి భద్రత తగ్గించడంపై తెలుగుదేశం శాసనసభ్యుడు దేవినేని ఉమా మహేశ్వర రావు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. రివ్యూ కమిటీకి నివేదించి వంశీకి భద్రత పెంచాలని ఆయన కోరారు. వంశీకి గురువారం పోలీసు కమిషనర్ భద్రతను తగ్గించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+