ఒరిస్సాలో మావోయిస్టు నేత రామకృష్ణ భార్య పద్మ అరెస్టు

ఈ ప్రాంతం వారం రోజుల్లో మొత్తం ఏడుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. పద్మపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.2 లక్షల రివార్డును ప్రకటించిందని తెలిపారు. ఈశ్వరి గతంలో విశాఖ డివిజన్లో పనిచేశారని, ప్రస్తుతం ఆమె కేంద్ర కమిటీకి పదోన్నతి పొందినట్లు తెలిపారు. ఆర్కే ప్రస్తుతం ఒరిస్సాలోని నారాయణ పట్నం ప్రాంతంలో ఉన్నట్లు చెప్పారు. అరెస్టయిన వారి నుంచి విలువైన పత్రాలు, దాడులకు సంబంధించిన వ్యూహరచనల చిత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సౌమేంద్ర వివరించారు.
వైరల్ జ్వరంలో బాధపడుతున్న తన భర్త ఆర్కేను కలిసేందుకు వెళుతున్న సమయంలోనే పద్మను ఒరిస్సా పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం రామకృష్ణ కొద్దిరోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఓ ఆర్ఎంపీ వైద్యుడిని వెంట తీసుకొని భర్తను చూసేందుకు ఒరిస్సా వెళ్లిన పద్మను కోరాపుట్ జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. పద్మపై ఉన్న కేసులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరందరినీ అరెస్టు చేసినట్లుగా ఆదివారం ప్రకటించగా అంతకు నాలుగు రోజుల ముందే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications