కాంగ్రెసు వర్సెస్ వైయస్ జగన్ : పార్టీ అధిష్టానం సీరియస్

YS Jagan
హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాలు కాంగ్రెసు వర్సెస్ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ గా మారాయి. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వ్యతిరేకంగా సాక్షి దినపత్రికలో, టీవీ చానెల్లో వార్తాకథనం ఇవ్వడంతో రాష్ట్ర కాంగ్రెసు నాయకులు కొంత మంది వైయస్ జగన్ పై ప్రత్యక్ష సమరానికి దిగారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా సాక్షి వార్తాకథనాన్ని వ్యతిరేకించారు. వైయస్సార్ ఎప్పుడు కూడా సోనియాపై, రాజీవ్ పై విమర్శలు చేయలేదని చెప్పారు. వైయస్సార్ ఏనాడూ కాంగ్రెసు జెండాను వీడలేదని చెప్పారు. తద్వారా ఆయన వైయస్ జగన్ పై పరోక్షంగా విమర్శలు చేశారనే అనుకోవాలి. కాంగ్రెసు నాయకుడు వి. హనుమంతరావు, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రత్యక్షంగానే వైయస్ జగన్ పై విమర్శలు చేశారు. సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యుడు పి. శంకర్ రావు తీవ్రంగా ప్రతిస్పందించారు.

సాక్షిని నిషేధించాలని శంకరరావు డిమాండ్ చేశారు. సోనియాకు వ్యతిరేకంగా వార్తాకథనం ఇచ్చినందుకు 24 గంటలలోగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే సాక్షి కార్యాలయం ముందు ధర్నాకు దిగుతానని ఆయన హెచ్చరించారు. ఇష్టం లేకపోతే పార్టీ నుంచి వెళ్లిపోవాలని కూడా అన్నారు. వైయస్ జగన్ అహంభావానికి ఆ వార్తాకథనం నిదర్శనమని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే వైయస్ జగన్ పై పార్టీ అధిష్ఠానం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వైయస్ జగన్ సాధ్యమైనంత తొందరగా పార్టీని విడిచిపెట్టి, సొంత పార్టీ పెట్టే ఉద్దేశంతోనే సోనియాపై ప్రత్యక్ష పోరుకు దిగారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దానికితోడు, అధిష్టానం నాడిని పట్టుకోవడానికి ఆయన ఈ వార్తాకథనం ద్వారా ప్రయత్నించారా అనే సందేహం కూడా కలుగుతోంది. అయితే, ఇంత దాకా వచ్చిన తర్వాత వైయస్ జగన్ ను పార్టీ అధిష్టానం సహించబోదనే మాట వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+