సాక్షిపై భగ్గుమన్న కాంగ్రెసు శ్రేణులు: వైయస్ జగన్ పోటీ ఆందోళనలు

Congress
హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి వ్యతిరేకంగా సాక్షి చానల్‌లో వచ్చిన కథనాలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. సాక్షికి వ్యతిరేకంగా రాష్ట్ర రాజధానిలోని సాక్షి కార్యాలయం సహా వివిధ జిల్లాల్లోని ఆ పత్రిక కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగాయి. సాక్షి మీడియా యజమాని, కడప ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి దిష్టిబొమ్మలనూ దహనం చేశాయి. గతంలో ఎన్నడూ సాక్షి కార్యాలయం వైపు కన్నెత్తి చూసేందుకు కూడా ఇష్టపడని నేతలు ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాని ఆఫీసుల ముందే ఆందోళనకు దిగారు.

సాక్షికి మద్దతుగా నెల్లూరు, ఒంగోలు, చీరాల, అనంతపురం జిల్లా కదిరి తదితర చోట్ల జగన్ వర్గీయులు ర్యాలీలు నిర్వహించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆవరణలో జగన్ మద్దతుదారులుగా చెబుతున్న కొందరు విద్యార్థులు సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. దాంతో ఉత్తరాంధ్ర విద్యార్థిసేన సోనియా పటానికి క్షీరాభిషేకం జరిపింది. రాష్ట్రంలో ఎక్కడేం జరిగినా జగన్‌ను బాధ్యులుగా చూపుతూ రాజకీయ లబ్ధి పొందేందుకు సీనియర్లు ప్రయత్నిస్తున్నారని గుంటూరు మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. అధిష్ఠానానికి, జగన్‌కు మధ్య అంతరాలు పెంచేందుకు కేకే, వీహెచ్, సర్వే వంటి నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జగన్‌ను ఒంటరి చేసేందుకు పార్టీలోని కొందరు సీనియర్లు కుయుక్తులు పన్నుతున్నారని పీసీసీ మాజీ కార్యదర్శి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నెల్లూరులో విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+