యెడ్యూరప్పకు ఎలాంటి డెడ్ లైన్లు లేవు: వెంకయ్యనాయుడు

కర్ణాటక సంక్షోభం త్వరలో సమసిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తనను రాజీనామా చేయాలని కోరినందున యెడ్యూరప్ప కూడా తమకు ఎలాంటి షరతులు విధించలేదని చెప్పారు. ఆయన మొదటి నుండి అధిష్టానానికి కట్టుబడి ఉంటానని చెబుతున్నారన్నారు. తను సూచించిన వారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని, గాలి సోదరులను మంత్రివర్గం నుండి తప్పించాలని యెడ్యూరప్ప షరతులు విధించినట్టు చెబుతున్న వార్తల్లో నిజం లేదని వెంకయ్యనాయుడు చెప్పారు. పార్టీ ఆదేశాల మేరకు ఆయన ఢిల్లీకి వచ్చారన్నారు.












Click it and Unblock the Notifications