మిషన్ వైయస్ జగన్: స్క్రీప్టుతో సిఎల్పీ భేటీకి వీరప్ప మొయిలీ

వైయస్ జగన్ పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. వైయస్ జగన్ కు చెందిన సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తాకథనంపై కూడా చర్చ జరుగుతుంది. అధిష్టానం అందించిన పక్కా స్క్రిప్టుతో కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. వైయస్ జగన్ పై చర్య తీసుకునే అధికారాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అప్పగిస్తూ ఈ సమావేశంలో ఓ తీర్మానం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాక్షి దినపత్రిక వార్తాకథనాన్ని ఖండిస్తూ మరో తీర్మానం కూడా చేసే అవకాశం ఉంది. దీంతో వైయస్ జగన్ పై చర్యకు తగిన ప్రాతిపదిక ఏర్పాటు చేస్తున్నారు.
మంగళవారం రోశయ్య పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఎకె ఆంటోనీకి వైయస్ జగన్ వ్యవహారంపై 60 పేజీల నివేదిక అందజేసినట్లు తెలుస్తోంది. అదే ప్రతిని ఆయన సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కు కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు. సిఎల్పీ సమావేశంలో వైయస్ జగన్ కు అనుకూలంగా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ వ్యవహారాలు నడిపిన శాసనసభ్యులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో శాసనసభ్యుల మనోగతాన్ని కూడా అంచనా వేస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications