రంగంలోకి గులాం నబీ ఆజాద్: సిఎల్పీ సమావేశానికి హాజరు

Ghulam Nabi Azad
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రిగా కె. రోశయ్య రాజీనామా చేసిన నేపథ్యంలో అకస్మాత్తుగా గులాం నబీ ఆజాద్ రంగంలోకి వచ్చారు. బుధవారం సాయంత్రం హైదరాబాదులో జరిగే కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశానికి ఆయన కూడా వస్తున్నారు. సిమ్లాలో ఉన్న ఆజాద్ ను హైదరాబాద్ వెళ్లేందుకు అత్యవసరంగా ఢిల్లీకి పిలిపించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ఆయనకు ఎక్కువ పరిచయం ఉండడమే అందుకు కారణమని తెలుస్తోంది. కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, ఎకె ఆంటోనీ, వీరప్ప మొయిలీలతో పాటు ఆయన హైదరాబాద్ వస్తున్నారు. సోనియా సలహాదారు అహ్మద్ పటేల్ పేరు వినిపించినప్పటికీ ఆయన స్థానంలో ఆంటోనీ వస్తున్నారు.

గతంలో ఆజాద్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీగా వ్యవహరించారు. 2004 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పార్టీకి పొత్తు కుదిర్చింది కూడా ఆయనే. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి ఇష్టం లేకపోయినా తెరాసతో ఆయన పొత్తు కుదిర్చారు. పొత్తులు కుదర్చడంలోనూ పరిస్థితులను అంచనా వేయడంలోనూ ఆజాద్ ది అందె వేసిన చేయి అంటారు. అందుకే ఆజాద్ ను ప్రత్యేకంగా పిలిపించి హైదరాబాద్ పంపిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఇంత వరకు తెర వెనక ఉండిపోయిన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తెర మీదికి వచ్చారు. తెలంగాణ సీనియర్ నాయకులు రోశయ్య రాజీనామా చేస్తున్నట్లు వార్త వచ్చిన వెంటనే హైదరాబాదులో డిఎస్ ను కలుసుకున్నారు. అంతకు ముందు తెలంగాణ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించారు. రోశయ్య రాజీనామా చేయడం బాధాకరమని మంత్రి జె. గీతారెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+