శాసనసభ స్పీకర్ పదవికి రేసులో మర్రి శశిధర్ రెడ్డి, గాదె వెంకటరెడ్డి, ఆనం

కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికైన కిరణ్కుమార్రెడ్డి తన ప్రాధాన్యతలు, అధిష్ఠానం సూచనలు రెంటినీ పరిగణలోకి తీసుకుని మంత్రివర్గ కూర్పును నిర్ణయించనున్నారు. ముఖ్యమంత్రిని మార్చే విషయంలో నిర్ణయం తీసుకున్నప్పుడే అధిష్ఠానం మంత్రివర్గ విస్తరణపైనా దాదాపు ఒక నిర్ణయానికి వచ్చిందని తెలిసింది. కిరణ్కుమార్రెడ్డి సీఎం కావడంతో మంత్రివర్గంలో భారీ మార్పులేవీ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇప్పటివరకూ స్పీకర్గా ఉన్న కిరణ్కుమార్రెడ్డి ఇప్పుడున్న మంత్రుల్లో చాలామందితో సంబంధాలు కలిగి ఉండడంతో కొంతమందిని మాత్రమే మార్చేందుకు అవకాశం ఉందని అంటున్నారు. గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక మంత్రివర్గ కూర్పుపై కిరణ్కుమార్రెడ్డి దృష్టిసారిస్తారని తెలిసింది. మరోవైపు జగన్ వర్గీయులైన మంత్రుల విషయంలో ఆయన ఎలాంటివైఖరి అవలంభిస్తారనే దానిపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications