సోనియా సలహాల మేరకే కేబినెట్: సిఎం కిరణ్ కుమార్ రెడ్డి

Kiran kumar Reddy
న్యూఢిల్లీ: తమ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సలహాలు, సూచనల మేరకు మంత్రి వర్గ ఏర్పాటు ఉంటుందని ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గంపై చర్చించేందుకే తాను ఢిల్లీ వచ్చినట్లు ఆయన తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ముఖ్యమంత్రి పదవిని అఫ్పగించినందుకు ధన్యవాదాలు తెలుపుతానని, ఇందుకు అధిష్టానానికి చెందిన నాయకులను తాను కలుస్తానని ఆయన చెప్పారు. తన పాలన పారదర్శకంగా ఉంటుందని, అది కొద్ది రోజుల్లో అందరికీ తెలిసిపోతుందని ఆయన అన్నారు. మంచి పాలన అందించడానికి ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు.

కిరణ్ కుమార్ రెడ్డి శనివారం ఢిల్లీలో బిజీగా గడుపనున్నారు. ఉదయం గం.9.45 నిమిషాలకు గులాం నబీ ఆజాద్ తో భేటీ ఉంది. గం.11.15 నిమిషాలకు ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీతో భేటీ అవుతారు. 11. 45 నిమిషాలకు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డితో సమావేశమవుతారు. కేంద్ర మంత్రి ఆంటోనీతో మధ్యాహ్నం 12 గంటలకు, కేంద్ర హోం మంత్రి చిదంబరంతో పన్నెండున్నర గంటలకు సమావేశమవుతారు. కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీ ఢిల్లీలో లేరు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆయన సమావేశమై మంత్రి వర్గాన్ని ఖరారు చేయించుకుంటారు. మంత్రివర్గంలో తాను చేర్చుకోదలచినవారి పేర్లతో ఆయన ఢిల్లీకి చేరుకున్నట్లు సమాచారం. సోనియా సలహా మేరకు అందులో కొన్ని మార్పులు చేస్తారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+