31 మందితో రేపే కిరణ్ కుమార్ క్యాబినెట్ ప్రమాణం

వైయస్ జగన్ వర్గానికి చెందినవారికి పెద్దగా మంత్రివర్గంలో చోటు లభించకపోవచ్చునని అంటున్నారు. అయితే, తమకు సరెండర్ అయిన కొండ్రు మురళి వంటి జగన్ వర్గీయులకు మాత్రం మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశాలుంటాయని అంటున్నారు. తమకు పూర్తిగా సరెండర్ అయితే తప్ప వైయస్ జగన్ వర్గీయులకు మంత్రివర్గంలో స్థానం కల్పించకూడదనే ఉద్దేశంతో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఆ మేరకే కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారని అంటున్నారు. శనివారం ఉదయం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి సోనియా గాంధీతో పాటు అధిష్ఠానం పెద్దలను కలవడంలో బిజీగా ఉన్నారు. ఆయన శనివారం సాయంత్రమే హైదరాబాదుకు తిరిగి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పది నుంచి పదిహేను కొత్త ముఖాలు ఉంటాయని అంటున్నారు. పాలడుగు వెంకటరావు వంటి పార్టీ విధేయులకు తప్పనిసరిగా మంత్రి పదవులు ఇచ్చే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. బాలినేని శ్రీనివాస రెడ్డికి మాత్రం మొండిచేయే చూపే అవకాశం ఉంది. మంత్రివర్గంలో స్థానం కోసం ఢిల్లీ వచ్చిన వైయస్ జగన్ బాబాయ్ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డిని కలిశారు.












Click it and Unblock the Notifications