జగన్ కు, అధిష్టానానికి మధ్య ఎడబాటు తొలగించడానికే :వైయస్ వివేకా

YS Vivekananda reddy
న్యూఢిల్లీ: తన సోదరుడు వైయస్సార్ కుమారుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు, పార్టీ అధిష్టానానికి మధ్య ఉన్న గ్యాప్ ను తొలగించడానికే తాను ఢిల్లీ వచ్చానని ఎమ్మెల్సీ వైయస్ వివేకానంద రెడ్డి అన్నారు. దాసుడి తప్పు దండంతో సరి పెద్దలు చెబుతారని, తమ తప్పులుంటే సోనియాకు చెప్పుకుంటామని ఆయన అన్నారు. వైయస్ జగన్ పై ఏ విధమైన చర్యలు తీసుకోవద్దని ఆయన కోరారు. శనివారం సాయంత్రం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైయస్ జగన్ సేవలను ఎక్కడ, ఎప్పుడు వినియోగించుకోవాలో సోనియాకు తెలుసునని ఆయన అన్నారు. వైయస్ జగన్ మంచి వ్యక్తిగా మారుతారని, 2014 ఎన్నికల్లో కాంగ్రెసు విజయానికి కృషి చేస్తారని ఆయన చెప్పారు. వైయస్ జగన్ ను అధిష్టానానికి దూరం చేయాలని, కాంగ్రెసు పార్టీని బలహీన పరచాలని మీడియా ప్రయత్నిస్తోందని, దాన్ని అడ్డుకుని కాంగ్రెసు పార్టీని పటిష్టం చేస్తామని ఆయన చెప్పారు.

వైయస్ జగన్ సహా తమ కుటుంబమంతా కాంగ్రెసు పార్టీ పటిష్టతకు కృషి చేస్తుందని ఆయన చెప్పారు. తాను ఢిల్లీకి వచ్చేప్పుడు వైయస్ జగన్ లేరని, అందుకే చెప్పి రాలేదని, తాను హైదరాబాదు వెళ్లిన తర్వాత జగన్ ను కలుస్తానని, కార్యకర్తలను కూడా కలుస్తానని ఆయన చెప్పారు. మరోసారి వైయస్ జగన్ తో కలిసి వచ్చి సోనియాను కలుస్తానని ఆయన చెప్పారు. వైయస్ జగన్ ప్రజాకర్షణ ఉన్న నాయకుడని ఆయన చెప్పారు. వైయస్ జగన్ వ్యవహారం చిన్న సమస్య అని, అది పరిష్కారమవుతుందని ఆయన చెప్పారు. వైయస్ జగన్ ను దెబ్బ తీయడానికే మీకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానం చూస్తోందనే వార్తలు వస్తున్నాయని మీడియా ప్రతినిధులు అనగా, వైయస్ జగన్ తో సయోధ్య కోసం తనను మంత్రివర్గంలోకి తీసుకుంటుందని ఎందుకు అనుకోరని ఆయన అడిగారు. తనను వాడుకుని వైయస్ జగన్ ను తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తోందని ఎందుకు అనుకోకూడదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+