పిసిసి చీఫ్ కిరణ్ కుమార్ మిత్రుడు దామోదరం రాజనర్సింహ?
కడప పార్లమెంటు సభ్యుడు జగన్ వర్గానికి చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డిలను దూరం పెట్టితే ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయో చర్చిస్తున్నారు. కిరణ్ సైతం 10 మంది కొత్తవారికి అవకాశమిచ్చేందుకు ఆలోచిస్తున్నారు. కర్నూలు జిల్లాలో జెసి దివాకర్ రెడ్డి, టిజి వెంకటేష్ లలో పోటీ నెలకొనటంతో ఇద్దరికి ఇచ్చే అవకాశముంది. దామోదరకు రాజనర్సింహకు పిసిసి పదవి ఇస్తే రెండు రకాలుగా లబ్ధి పొందవచ్చునని అధిష్టానం భావిస్తోంది. దామోదర తెలంగాణ వ్యక్తి కావటం ఒకటి అయితే, ఆయన మాదిగ వర్గానికి చెందిన వాడు కావటం రెండో కారణం. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తమకు సరియైన ప్రాతినిధ్యం ఇవ్వలేదనే భావనలో మాదిగలు ఉన్నారు. దామోదరకు ఇస్తే ఆ అపప్రద తొలగిపోతుందని భావిస్తున్నారు. దామోదరం రాజనర్సింహ కిరణ్ కుమార్ కు సన్నిహిత మిత్రుడు. ఇద్దరు కలిసి చదువుకున్నారు.
అంతకుముందు కిరణ్కుమార్రెడ్డి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి వీరప్ప మొయిలీతో భేటీ అయ్యారు. ఆ తరువాత అహ్మద్ పటేల్ తో భేటీ అయ్యారు. సోమవారం సోనియాగాంధీతో మరోసారి భేటీ ఆయ్యే అవకాశముంది. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి మరో రెండ్రోజులు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, స్పీకర్ అభ్యర్థులు కూడా ఖరారయ్యాకే సీఎం తిరుగప్రయాణం కానున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గం తుదిజాబితా ఖారారు అయ్యాక మిగతా పదవులపై ముఖ్యమంత్రి కసరత్తు చేయనున్నారు. ఎల్లుండి మధ్యాహ్నం కిరణ్కుమార్రెడ్డి హైదరాబాద్కు తిరిగివచ్చే అవకాశం ఉంది.