వైఎస్ ఆదర్శంగా పనిచేయాలి: సిఎంకు శోభానాగిరెడ్డి సూచన
Districts
oi-Srinivas G
By Srinivas
కర్నూల్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదర్శంగా తీసుకొని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పని చేయాలని ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యురాలు శోభానాగిరెడ్డి ఆదివారం కర్నూలులో విలేకరుల సమావేశంలో అన్నారు. ప్రజలు తమ సమస్యలు పరిష్కరిస్తారని ఆశలతో ఎన్నుకున్న శాసనసభ్యులు ఇప్పుడు పదవుల కోసం అధిష్టానం చుట్టూ తిరుకుతున్నారన్నారు. పరిపాలనను, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి శాసనసభ్యులు మంత్రి మండలిలో అవకాశం కోసం ఢిల్లీ వెళ్లడం దారుణమన్నారు. అక్కడ పైరవీల చేపట్టడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ప్రజలలో ఉండి ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయలని ఆమె సూచించారు.