వైయస్ జగన్ తో గానీ కాంగ్రెసుతో గానీ మా వారు పోరు: నాగం జనార్ధన్ రెడ్డి
రైతులు మద్దతు ధర లేక ఆవేధన చెందుతున్నారన్నారు. జూనియర్ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్ల సమస్య కూడా ప్రభుత్వం తీర్చలేక పోతుందన్నారు. 12 సంవత్సరాలు వారు సేవ చేస్తున్నా వారికి సరియైన వేతనాలు లేక రోడ్డుమీద పడ్డారన్నారు. బీడీ కార్మికుల సమస్యను కూడా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. స్వతంత్ర భారతదేశంలోనే 2జి అతిపెద్ద కుంభకోణమన్నారు. అలాంటి కుంభకోణంపై చర్చించకుండా అధికార పక్షం అడ్డుకుంటుందన్నారు. ఆదర్శ్, కామన్వెల్తు కుంభకోణాలు, కొన్ని కార్యాలయాల్లో పైళ్లు గల్లంతు కావడాలు చూస్తుంటే కాంగ్రెసు ప్రభుత్వం ఎంతటి అవినీతిలో కూరుకు పోయిందో తెలుస్తుందన్నారు.
కాంగ్రెసు ప్రభుత్వం కుంభకోణానిని నిరసనగా హైదరాబాదులో ఓ భారీ ర్యాలీ, బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ ర్యాలీకి జాతీయ స్థాయి నాయకులను ఆహ్వానించి కేంద్రంపై కుంభకోణాలపై విచారణకు ఒత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తామన్నారు. కాంగ్రెసు లోని తాజా రాజకీయ పరిణామాలతో మాకు సంబంధం లేదని, అయితే ఒక రాజకీయ పార్టీగా ఆ పరిణామాలు పరిశీలిస్తున్నామన్నారు. తమకు జగన్, కాంగ్రెసు కాదని ప్రజల సమస్యల పరిష్కారం కావాలన్నారు.