చిరంజీవిది ప్రజాకర్షణే, వైయస్ జగన్ ది ప్రజాదరణ కూడా: రోజా
నాడు చంద్రబాబునాయుడి అడ్మినిస్ట్రేషన్ నచ్చే నేను తెలుగుదేశం పార్టీలో చేరానని అయితే చుట్టూ ఉన్న నాయకుల వల్ల అందులో ఇమడలేక పోయానన్నారు. తెదేపాలో ఉండగా తాను వైయస్ పై చేసిన విమర్శలను ఆయన పాజిటివ్ గా తీసుకోవటం నన్ను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. నాడు వైయస్ పై చేసిన ఫైట్ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే గానీ వ్యక్తిగత కక్ష్యతో కాదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కొరకు ప్రభుత్వంపై పోరాడాలని నేను అదే చేశానని ఆమె చెప్పారు.
నా ఎదుగుదలకు చూసి ఓర్వలేకనే కొందరు నేతలు నన్ను ఐరన్ లెగ్ అంటున్నారన్నారు. నన్ను విమర్శిస్తున్న వారే 1999లో ఆ తర్వాత పలుమార్లు ప్రచారం చేయించి గెలిచారన్నారు. 2004, 2009లో నేను ప్రచారం చేయలేదు కాబట్టే సీట్లు తగ్గి ఓడిపోయారని రోజా చెప్పారు. పదవుల కోసం నేను ఏనాడు ప్రయత్నాలు చేయలేదన్నారు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు సైతం పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడలేదన్నారు. ఏదైనా ఉంటే సూటిగా మాట్లాడటమే తెలుసునన్నారు. నాకు డబ్బు, ఇంతటి పేరు ఇచ్చిన ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానని రోజా చెప్పారు.