సోనియా బొమ్మల దగ్ధంపై వైయస్ జగన్ వర్గానికి డి శ్రీనివాస్ వార్నింగ్
దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి ఈ స్థాయికి ఎదగడానికి కాంగ్రెసు పార్టీయేనన్నారు. కాంగ్రెసు పార్టీ వైయస్ కు అన్ని విధాలా అండగా నిలిచిందన్నారు. రాజీవ్ గాంధీ, ముఖ్యంగా సోనియాగాంధీ పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చారన్నారు. తాను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని తాను చూసినంత వరకు వైయస్ కు ఇచ్చినంత స్వతంత్రం మరే ముఖ్యమంత్రికి ఇవ్వలేదన్నారు. వైయస్ కు అధిష్టానం పెద్ద పెద్ద పదవులు కట్టబెట్టిందన్నారు. అయితే జగన్ను, విజయమ్మను రాజీనామాలు ఉపసంహరించుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఒక్కవైపే చూడటం సరికాదని ఆయన అన్నారు.
కొందరి ప్రవర్తన చూస్తుంటే వారికి కాంగ్రెసు పార్టీలో సభ్యత్వముందా అనిపిస్తుందన్నారు. జగనో, లేదా సోనియా దృష్టిలోనే పడాలనో అలాంటివి చేయటం సరికాదన్నారు. నెహ్రూలాంటి గొప్ప నాయకుడి విగ్రహాలను విరగ్గొట్టడమేమిటన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి మృతి చెందడం దురదృష్టకరమైతే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మరింత దురదృష్టకరమన్నారు. సోనియా, రాజీవ్ బొమ్మలను కాల్చితే ఊరుకోమన్నారు. సోనియాపై నీచాతినీచంగా మాట్లాడుతన్న వారు కాంగ్రెసు కార్యకర్తలు కాదన్నారు. అధిష్టానం కూడా దీనిని తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. దీనిని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తే పార్టీనుండి బహిష్కరిస్తామన్నారు.