వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ తో రాయపాటిని ఫోన్లో మాట్లాడించలేదు: అంబటి రాంబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
గుంటూరు: కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావుతో తాను వైయస్ జగన్ ను ఫోన్ లో మాట్లాడించలేదని వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకుడు అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రాయపాటి సాంబశివరావుతో భేటీ అయిన అంబటి రాంబాబు సోమవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాయపాటితో జగన్ ను ఫోన్లో మాట్లాడించినట్లు మీరే ఉహించుకున్నారని, ఊహించుకునే హక్కు మీకు ఉందని, తాను కాదలేని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. రాయపాటి సాంబశివరావుతో తాను రాజకీయపరమైన అంశాలేమీ మాట్లాడలేదని ఆయన చెప్పారు.

రాయపాటి వ్యవహారంతో గుంటూరు జిల్లా రాజకీయ సమీకరణల్లో మార్పులు వచ్చినట్లేననా అని అడిగితే రాష్ట్రవ్యాప్తంగా సమీకరణలు మారుతాయని ఆయన జవాబిచ్చారు. రాయపాటి విషయం ప్రస్తావించగా సమీకరణల మార్పు ప్రారంభమే కాలేదని ఆయన చెప్పారు. రాయపాటి అసంతృప్తితో ఉన్నారని, అందువల్ల ఈ విషయాలన్నీ రాయపాటిని అడిగితేనే మంచిదని, రాయపాటి అయితేనే సమాధానం చెప్పగలరని ఆయన అన్నారు. రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు కాబట్టి రాయపాటి అయితేనే సరైన సమాధానం ఇవ్వగలరని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X