హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మందకృష్ణ దీక్ష విరమిస్తే అఖిలపక్షానికి సిద్ధం: మంత్రి శైలజానాథ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sailajanath
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ విషయమై అఖిలపక్షాన్ని న్యూఢిల్లీ తీసుకు వెళ్లేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని మంత్రి సాకె శైలజానాథ్ మంగళవారం స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఢిల్లీలో అధిష్టానాన్ని కలవడానికి అనుమతులు అంత తేలిగ్గా దొరకవన్నారు. అయితే మందకృష్ణ మాదిగ దీక్ష విరమిస్తే ఢిల్లీ తీసుకు వెళ్లే విషయాన్ని ఆలోచిస్తామన్నారు. మందకృష్ణ దీనిని అర్థం చేసుకొని దీక్ష విరమించాలన్నారు.

ఢిల్లీకి అఖిల పక్ష ప్రతినిధులను తీసుకుని వెళ్లాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీయస్ నేత మందకృష్ణ మాదిగ నాలుగు రోజులుగా సికింద్రాబాదులోని పార్శిగుట్టలో గల తన నివాసంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. పితాని సత్యనారాయణ, శైలజానాథ్ వంటి మంత్రులు ఎంతంగా విజ్ఞప్తి చేసిప్పటికీ ఆయన వినకుండా దీక్షను కొనసాగిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X