కెసిఆర్ లా వసూళ్లకు పాల్పడలేదు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

Jagga Reddy
మెదక్: తెలంగాణ పేరుతో ప్రజలను మభ్యపెట్టి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు వసుళ్లకు పాల్పడినట్టు మేం వసూళ్లకు పాల్పడలేదని శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) బుధవారం విలేకరులతో అన్నారు. జగ్గారెడ్డి బుధవారం మెదక్ లో తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.

30 కోట్ల రూపాయల ఖర్చుతో వరంగల్ లో మహాగర్జన పేరుతో భారీ సభకు ఏర్పాట్లను చేస్తున్న కెసిఆర్ తెలంగాణ కోసం అమరులైన వీరులకు పరిహారాన్ని ఎందుకు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ కోసం అమరులైన వీరులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై కేసిఆర్ నిబద్దతను చట్టసభల్లోనే తేల్చుకుంటామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+