నన్ను సిఎంగా ఎందుకు చేశారో తెలియదు: కిరణ్ కుమార్ రెడ్డి

వైయస్ రాజశేఖర రెడ్డి, కె. రోశయ్య లేకుండా ప్రభుత్వాన్ని నడపడం కష్టమేనని ఆయన అన్నారు. శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత పార్టీ కార్యకర్తలను విస్మరించడం మంచి పద్ధతి కాదని ఆయన హితవు చెప్పారు. ప్రతి కార్యకర్తను గుర్తుంచుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. తాను తక్కువగా మాట్లాడి ఎక్కువ పనిచేస్తానని ఆయన చెప్పారు. 2014 ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన చెప్పారు. జిల్లాలన్నీ పర్యటించిన తర్వాత నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తో మాట్లాడి వాటిని భర్తీ చేస్తానని ఆయన చెప్పారు. శాసనసభ స్పీకర్ ఎవరనేది రెండు రోజుల్లో తేలిపోతుందని ఆయన చెప్పారు. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications