వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజాది దేశంలోనే అతి పెద్ద కుంభకోణం: జయప్రకాష్ నారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayaprakash Narayana
విశాఖపట్నం: లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ కేంద్ర ప్రభుత్వం అవినీతిపై నిప్పులు గురువారం విశాఖపట్నంలో నిప్పులు చెరిగారు. మాజీ మంత్రి రాజా 2జి స్పెక్ట్రం కుంభకోణంలో ఇప్పటి వరకు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. అధికారంలో ఉన్నవారు పెద్ద పెద్ద కుంభకోణాల్లో కూరుకు పోతున్నాయన్నారు. ప్రజా సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. అవినీతిని అరికడితే భారతదేశం 20 ఏళ్లలో 16 రెట్లు అభివృద్ధి చెందుతుందన్నారు.

ఒకప్పుడు ఏ ఒక్క మంత్రికో సెల్ ఫోన్లు ఉండేవి కావని, ఇప్పుడు సామాన్యుడు సైతం ఫోన్లు వాడుతున్నారన్నారు. పదేళ్ల క్రితం దేశం మొత్తంలో 70 లక్షల ఫోన్లు ఉండవని, ఇప్పుడు మాత్రం వంద రెట్లు పెరిగి 70 కోట్ల సెల్ ఫోన్లు ఉన్నాయన్నారు. నెలకు 2కోట్ల కొత్త ఫోన్లు భారత్ కు దిగుమతి అవుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు. సెల్ ఫోన్ల వాడకం బాగా పెరిగిందని చెప్పుకొచ్చారు. పాతతరంలో నడిస్తే అవినీతిని అరికట్టవచ్చని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X