కిరణ్ కు వైయస్ జగన్ అల్టిమేటం: 48 గంటలు నిరాహార దీక్ష

ప్రభుత్వం 9 గంటలపాటు ఉచిత విద్యుత్తు ఇచ్చేందుకు కూడా ముందుకు రావడం లేదని, వైఎస్ హయాంలో ఉచిత విద్యుత్తు ఫైలుపై సంతకం చేశారన్నారు. పంటలు నష్టపోయి నిండా మునిగి పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించేందుకు వచ్చిన తనను రైతులే పరామర్శిస్తున్నారని జగన్ అన్నారు. రైతులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ మూడోరోజు యాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లి, లక్ష్మీపురం మీదుగా బందరుకు వచ్చారు. ఇంతటి కష్టంలో ఉన్న రైతును ఇప్పుడు ఆదుకుంటే ఇంకా ఎప్పుడు ఆందుకుంటారని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా యాత్ర సందర్భంగా చేసిన వడ్డీ మాఫీ, రైతులకు రబీకి ఉచిత ఎరువులు, ఉచిత విత్తనాలు, ఏడాదిపాటు అప్పుల రికవరీ నిలిపివేత తదితర డిమాండ్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదే రీతిలో వ్యవహరిస్తే మూడున్నరేళ్లలో కూకటి వేళ్లలో కూలిపోతుందని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications