గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కు హైకోర్టులో చుక్కెదురు

ఓఎంసీ తరఫు సీనియర్ న్యాయవాది ఉదయం వాదనలు కొనసాగిస్తూ - ఢిల్లీ పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం నోటీఫికేషన్ జారీ చేశారని పేర్కొన్నారు. అయితే ఖనిజాల వ్యవహారంలో పోలీసులకు పాత్ర లేదని చెప్పారు. ఎంఎండీఆర్ చట్టంలోని సెక్షన్ 22 ప్రకారం అక్రమ మైనింగ్ వ్యవహారంలో పోలీసుల ఇచ్చే నివేదికను మేజిస్ట్రేట్ పరిగణనలోకి తీసుకోరాదని స్పష్టంగా ఉందన్నారు. అందువల్ల సమయం వృథా తప్ప దర్యాప్తు వల్ల ప్రయోజనం లేదని చెప్పారు. అక్రమ మైనింగ్ వ్యవహారాలపై దర్యాప్తును అధీకృత అధికారి చేయాల్సి ఉందన్నారు. ఎంఎండీఆర్ చట్టాన్ని సవరణ చేసేదాకా మైనింగ్ వ్యవహారంలో పోలీసుల పాత్ర లేదని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ దర్యాప్తు పూర్తయ్యాక సంబంధిత అధికారికి సీబీఐ ఫిర్యాదు చేయవచ్చు కదా అన్ని ప్రశ్నించింది. అంతేగాకుండా ఇలా దర్యాప్తు చేయాలంటూ తాము కేంద్రాన్నిగానీ, సీబీఐనిగానీ ఎలా ఆదేశించగలమంది. దర్యాప్తు అధికారి నివేదికను కోర్టుకే అందజేస్తారని ఎందుకు భావించాలి? సంబంధిత ఉన్నతాధికారికి ఫిర్యాదు చేయవచ్చు కదా? అని ప్రశ్నించింది. పరిశోధన పూర్తయ్యాకనే అధీకృత అధికారి తదితర అంశాలు తెరపైకి వస్తాయి తప్ప.. ఈ దశలో కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలన్న కేసుగా దీన్ని తాము పరిగణించలేమని పేర్కొంది.
సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ వివేక్ ఠంకా వాదనలు వినిపిస్తూ - ఓఎంసీ వాదనలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో వాదించిన సీనియర్ న్యాయవాది తాము దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ను మాత్రమే సవాలు చేస్తున్నామన్నారని, ఎఫ్ఐఆర్తో సంబంధంలేదని చెప్పారని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు అదే కంపెనీకి చెందిన మరో న్యాయవాది ఎఫ్ఐఆర్ గురించిన అంశాలనే ప్రస్తావిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వ్యవహారాల్లో సీబీఐని నియంత్రిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏవైనా ఉంటే చెప్పాలని కోరారు. సుప్రీం ఆదేశాల మేరకే సీఈసీ విచారణ చేపట్టిందని, ఏవైనా ఉంటే అక్కడే తేల్చుకోవాలన్నారు. 2009 డిసెంబరు 7న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని, 14న ఇదే హైకోర్టు స్టే మంజూరు చేసిందని చెప్పారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన వారంలోనే ఆగిపోయిందని చెప్పారు. ఫిర్యాదు దాఖలు చేసే సమయంలోనే అధీకృత అధికారి ప్రస్తావన వస్తుందని చెప్పారు. ఢిల్లీ పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ చట్టంలోని సెక్షన్ 3 కింద ఏడు రకాలైన నేరాలను వివిధ చట్టాల కింద సీబీఐ విచారణ చేపట్టవచ్చని, అందులో మొదటి చట్టం ఎంఎండీఆర్ అని చెప్పారు. దీంతో పాటు అటవీశాఖ, అక్రమ మైనింగ్, ప్రభుత్వ అధికారుల పాత్ర తదితరాలపై దర్యాప్తు చేయవచ్చన్నారు. ఈ వ్యవహారం కోట్లాది రూపాయలతో ముడిపడి ఉందని, ప్రభుత్వ ఉద్యోగులు పాత్ర కూడా ఉందని, అవినీతి నిరోధక చట్టం కింద వారిపై విచారణ చేపట్టవచ్చని తెలిపారు. అక్రమ మైనింగ్ ద్వారా జాతీయ సంపదను కొల్లగొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తమకు సాక్ష్యం చెప్పినవారు ఇప్పుడు ముందుకు రావడంలేదని, బెదిరించి సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని చెప్పారు. పరిశోధన ద్వారానే వాస్తవం వెలికి వస్తుందన్నారు. ముఖ్యంగా ఎవరు దర్యాప్తు చేయాలన్న అంశాన్ని ఎంచుకునే అధికారం నిందితుడికి లేదని తేల్చి చెప్పారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications