హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైతుల సమస్యల పరిష్కారం కోసమే నిరాహార దీక్ష: చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: రైతుల సమస్యల పరిష్కారం కోసమే తాను నిరాహార దీక్ష చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం నిరాహార దీక్షకు కూర్చున్న సమయంలో స్పష్టం చేశారు. ఓ వైపు మద్దతు ధరలు తగ్గుతుంటే రైతులు పెట్టుబడి ఖర్చులు పెరిగి పోతున్నాయన్నారు. కౌలు దార్లు మరింత నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం అండగా నిలవక పోవటంతో రైతులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారన్నారు. రైతుల పరిస్థితి చూస్తుంటే కళ్లనుండి నీళ్లు వస్తున్నాయన్నారు. రైతులు తీవ్ర నష్టాలతో ఆత్మహత్యలకు పూనుకుంటున్నారన్నారు. ఈ ప్రభుత్వం హయాంలో వ్యవసాయం మనుగడ సాధించలేదన్నారు.

కౌలు రైతులకు పంట నష్టం చెల్లించాలన్నారు. కౌలుదారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉన్నప్పటికీ స్పందించటం లేదన్నారు. అసెంబ్లీలో ఆరు రోజులపాటు విద్యార్థులు, రైతుల సమస్యల గురించి అన్ని విధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. రైతులకోసం ఎన్ని విధాలుగా ప్రయత్నించాలో అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రభుత్వంనుండి స్పందన లేకుండా పోయిందని అందుకే నిరవదిర నిరాహార దీక్షకు పూనుకున్నానన్నారు. రైతులకోసం, పేదలకోసం తాన నిరాహార దీక్షకు పార్టీలకతీతంగా అందరూ మద్దతు పలకాలని కోరారు. ప్రభుత్వంపై అందరం సమైక్యంగా పోరాడుదామని చెప్పారు.

ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎకరాకు పదివేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కమిషన్ చెప్పినప్పటికీ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. పత్తి, చెరకు, ఉల్లి, వేరుశనగ తదితరుల పంటలకు కూడా తగిన ధర ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ ప్రాంతంలో రైతులకు మద్దతు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం, కేంద్రం రైతులకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తే తప్పు వారిని ఆదుకోలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. రైతులతో పాటు మత్స్యకారులను, చేనేత కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X