రైతుల సమస్యల పరిష్కారం కోసమే నిరాహార దీక్ష: చంద్రబాబు
కౌలు రైతులకు పంట నష్టం చెల్లించాలన్నారు. కౌలుదారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉన్నప్పటికీ స్పందించటం లేదన్నారు. అసెంబ్లీలో ఆరు రోజులపాటు విద్యార్థులు, రైతుల సమస్యల గురించి అన్ని విధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. రైతులకోసం ఎన్ని విధాలుగా ప్రయత్నించాలో అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రభుత్వంనుండి స్పందన లేకుండా పోయిందని అందుకే నిరవదిర నిరాహార దీక్షకు పూనుకున్నానన్నారు. రైతులకోసం, పేదలకోసం తాన నిరాహార దీక్షకు పార్టీలకతీతంగా అందరూ మద్దతు పలకాలని కోరారు. ప్రభుత్వంపై అందరం సమైక్యంగా పోరాడుదామని చెప్పారు.
ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎకరాకు పదివేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కమిషన్ చెప్పినప్పటికీ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. పత్తి, చెరకు, ఉల్లి, వేరుశనగ తదితరుల పంటలకు కూడా తగిన ధర ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ ప్రాంతంలో రైతులకు మద్దతు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం, కేంద్రం రైతులకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తే తప్పు వారిని ఆదుకోలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. రైతులతో పాటు మత్స్యకారులను, చేనేత కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.