జిల్లాలో నేనొక్కడినే మిగులుతా: జేసి సంచలన వ్యాఖ్యలు

కాగా మంత్రివర్గంలో ముఖ్యమంత్రి తనకు స్థానం కల్పించకపోవటంపై ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. కాంగ్రెస్ 156 మంది శాసనసభ్యులు ఉన్నారని, అందరికీ మంత్రి పదవులు ఇవ్వాలంటే ఎక్కడినుండి ఇవ్వగలరన్నారు. సమర్థులు అనుకున్న వారికే మంత్రి పదవులు ఇచ్చారన్నారు. తాను సమర్థుడనని నమ్మలేదు. కాబట్టి తనకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు.
అయితే మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ముఖ్యమంత్రిపైగానీ, కాంగ్రెస్ పార్టీపైగానీ ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. చంద్రబాబు దీక్ష పేరుతో రాద్దాంతం చేస్తున్నారన్నారు. చంద్రబాబు అధికారం కోసమే ఈ నిరాహార దీక్ష చేపట్టారన్నారు. రైతులు చంద్రబాబును నమ్మె పరిస్థితి లేదన్నారు.












Click it and Unblock the Notifications