వైయస్ జగన్ వెంట మాజీ ఎమ్మెల్యే ఉదయభాను, వసంత కృష్ణప్రసాద్

తనకు జగ్గయ్యపేట టిక్కెట్ దక్కడం వైఎస్ దయేనని చెప్పారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మనసులో వైఎస్ ఉన్నారని, ఆ మనసులు జగన్ను బలపరుస్తున్నాయని అన్నారు. కార్యకర్తల మనోభావాల దృష్ట్యా తాను కూడా వైయస్ జగన్ వెంట నడుస్తానని స్పష్టం చేశారు. కార్యకర్తల మనోభావాలు అడిగి తెలుసుకున్న అనంతరం వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ - జగన్తోనే తన పయనమని చెప్పారు. రాష్ట్రానికి వైఎస్ వంటి సమర్థవంతమైన నాయకత్వం రావాలంటే జగన్ను సీఎం చేయాల్సి ఉందన్నారు. జగన్ వెంట.. తనతో పాటు ఎంపీ లగడ పాటి రాజగోపాల్ను కూడా తీసుకుపోవడానికి కృషి చేస్తానని చెప్పారు.
'జనం కోసం జగన్, జగన్ కోసం మేం' అన్న నినాదాలతో జగ్గయ్యపేట నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. కాబోయే సీఎం జగన్ అంటూ కార్యకర్తలు సభావేదికపై దూసుకు రావటంతో గంట సేపు ఏమి జరుగుతుందో అక్కడున్న ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. ఓ దశలో పోలీసులు లాఠీచార్జీకి సిద్ధపడగా కాంగ్రెస్ నేతలు ఆవేశంలో ఉన్న వారిని రెచ్చగొట్టినట్టు అవుతుందని వారించారు.












Click it and Unblock the Notifications