సోనియా గాంధీ నీచ స్థాయికి దిగజారిపోయారు: వైయస్ జగన్

తనను కడప పార్లమెంటు నియోజకవర్గంలో కట్టడి చేయడానికి ఒక్క నియోజకవర్గం నుంచే ముగ్గురిని మంత్రులను చేశారని, దాంతో ఆగిపోరని, కడప పార్లమెంటు స్థానంలోని ప్రతి శానసభా నియోజకవర్గానికి ఒక్కో మంత్రిని ఇంచార్జీల రూపంలో తీసుకుని వస్తారని, ఉప ఎన్నికలు కాబట్టి పోలీసులను యధేచ్ఛగా వాడుతారని, డబ్బులు కుమ్మరిస్తారని ఆయన అన్నారు. ఎన్ని కుతంత్రాలు చేసినా న్యాయమే గెలుస్తుందని, న్యాయం తన తరఫున ఉందని ఆయన అన్నారు. కడప పార్లమెంటు స్థానానికి, పులివెందుల స్థానానికి ప్రత్యేక పరిస్థితుల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ ఎన్నికలు దేశం యావత్తూ ఆసక్తిగా చూస్తున్నాయని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో తనను తన తండ్రిని ఆదరించినట్లు తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. వైయస్ మృతిపై సందేహాలను ఇప్పటి వరకు నివృత్తి చేయలేకపోయారని ఆయన అన్నారు. వైయస్ మృతికి కుట్ర జరిగిందని సందేహం వ్యక్తం చేసినందుకు సాక్షి కార్యాలయాలపై దాడులు చేయించారని, అనుమానాలు కూడా వ్యక్తం చేయలేని పరిస్థితి కల్పించారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications