వైయస్ జగన్ దీక్షకు వెళ్లడం లేదు: ఎమ్మెల్యే ఉగ్రనరసింహా రెడ్డి
Districts
oi-Pratapreddy
By Pratap
ఒంగోలు: రైతు సమస్యలపై వైయస్ జగన్ విజయవాడలో తలపెట్టిన నిరాహార దీక్షకు తాను వెళ్తున్నట్లు వచ్చిన వార్తలను కాంగ్రెసు కనిగిరి శాసనసభ్యుడు ఉగ్ర నరసింహారెడ్డి ఖండించారు. తాను వైయస్ జగన్ దీక్షకు వెళ్లడం లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తాను కనిగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు.
వైయస్ జగన్ దీక్షకు ఉగ్రనరసింహారెడ్డి హాజరు కావడానికి ఉగ్ర నరసింహా రెడ్డి విజయవాడకు చేరుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఏడుగురు శాసనసభ్యులు వైయస్ జగన్ దీక్షకు మంగళవారం విజయవాడకు చేరుకున్నారు.