జగన్ తో 72 మంది ఎమ్మెల్యేలు, మరో 50 మంది వస్తారు: జూపూడి

Jupudi Prabhakar Rao
విజయవాడ‌: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తో 72 మంది శాసనసభ్యులు ఉన్నారని, మరో 50 మంది శాసనసభ్యులు వస్తారని కాంగ్రెసు ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు చెప్పారు. జగన్ కు లభిస్తున్న ఆదరణతో ఢిల్లీ కంపిస్తోందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. మంగళవారంనాడు జగన్ దీక్షా ప్రాంగణానికి 25 మంది దాకా శాసనసభ్యులు వచ్చారు. రైతులే రాష్ట్ర ప్రభుత్వాన్ని దించుతారని ప్రముఖ సినీ నటి, జగన్ వర్గానికి చెందిన నాయకురాలు రోజా చెప్పారు.

కాగా, పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి మంత్రి శంకర రావుపై తీవ్రంగా మండిపడ్డారు. జగన్ కు మద్దతిస్తున్న ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని శంకర్ రావు చేసిన వ్యాఖ్యపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. శంకరరావును నోటీసు పంపించమనండి, నేను రాజీనామా చేస్తా అని ఆయన అన్నారు. అధిష్టానానికి ఫిర్యాదులు చేసే వైయస్ జగన్ ను పార్టీ నుంచి పంపించారని, జగన్ ను పంపించిన తర్వాత కాంగ్రెసు ఏమైందో చూస్తున్నామని ఆయన అన్నారు. వైయస్ జగన్ విషయంలో తనపై పార్టీ అధిష్టానం నుంచి ఒత్తిడి లేదని, ఉంటుందని తాను అనుకోవడం లేదని ఆయన అన్నారు. శంకరరావు నుంచి నీతులు నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+