ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన చిరంజీవి

ఖజానా ఖాళీ అవుతుందనే భయంతో రైతులను ఆదుకోకపోవడం సరైంది కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం రైతు విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. రైతులకు ప్రకటించిన ప్యాకేజీని అమలు కూడా చేయడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం కంటితుడుపు చర్యగానే ఉందని ఆయన అన్నారు. రైతు సమస్యలపై జరుగుతున్న పోరాటాలను రాజకీయంగానే ప్రభుత్వం చూస్తోందని, మానవతా దృక్పథంతో చూడడం లేదని ఆయన అన్నారు. చేనేత కార్మికులను కూడా ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications