హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ఒప్పుకోం: నాయిని నరసింహారెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Naini Narsimha Reddy
హైదరాబాద్: కేంద్రం తెలంగాణ ప్రకటించకపోతే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయాలని, లేదంటే ప్రజలు వారిపై తిరగబడతారని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు, సిరిసిల్ల శాసనసభ్యుడు కె తారకరామారావు ఆదివారం అన్నారు. కేంద్రం వెంటనే తెలంగాణ ప్రకటించాలన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు అనుకూలంగా ఉందా, లేదా అనేదానితో తమకు సంబంధం లేదని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే తమకు ముఖ్యమన్నారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకుంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని మరో నాయకుడు నాయిని నరసింహారెడ్డి అన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టి తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడానికి చూస్తున్నారన్నారు. రాజకీయ పార్టీలు అన్నీ తెలంగాణ కోసం ఏకత్రాటిపైకి వచ్చి పోరాడాలని కోరారు. లేదంటే వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే ఊరుకునేది లేదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X