గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు రాజకీయాల్లో కొత్త యుగం: దేవెగౌడ

By Pratap
|
Google Oneindia TeluguNews

Deve Gowda
గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి రాజకీయాల్లో కొత్త యుగం ప్రారంభమైందని మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. రైతుల కోసం చంద్రబాబు పోరాటం చేయాలని, తామంతా చంద్రబాబు వెంట ఉంటామని ఆయన అన్నారు. గుంటూరులో తెలుగుదేశం పార్టీ రైతు కోసం పేరిట ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన గురువారం సాయంత్రం ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం తన మనసును కలచివేసిందని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో గత ఎన్టీఆర్ హయాంలో మాదిరిగా లౌకిక పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 400 కోట్ల రూపాయలు ఏ మాత్రం సరిపోవని ఆయన అన్నారు. రైతు కష్టాల్లో ఉన్నప్పుడు యుపిఎ ప్రభుత్వం ఏనాడూ ఆదుకోలేదని ఆయన విమర్సించారు. గొప్పలు చెప్పుకుంటున్న యుపిఎ ప్రభుత్వ హయాంలో వ్యవసాయాభివృద్ధి 2.2 శాతం మాత్రమే ఉందని ఆయన అన్నారు. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ఈ ప్రభుత్వాలు రైతుల ఆగ్రహంలో కొట్టుకుపోతాయని ఆయన హెచ్చరించారు. గరీబీ హటావో నినాదం ఇచ్చిన కాంగ్రెసు ఇప్పుడు కిసాన్ హటావో నినాదంతో పనిచేస్తోందని తెలుగుదేశం రాజ్యసభ హరికృష్ణ అన్నారు.

గుంటూరు సభలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మారండీ మాట్లాడారు. ఈ సభకు పెద్దయెత్తున ప్రజలు హాజరయ్యారు. సిపిఎం నేత ప్రకాష్ కారత్, ఆర్ఎల్డీ నేత అజిత్ సింగ్, ఐఎన్ఎల్ఎండి నేత ఓం ప్రకాష్ చౌతాలా, సిపిఐ నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X