చంద్రబాబుకు రాజకీయాల్లో కొత్త యుగం: దేవెగౌడ
ఆంధ్రప్రదేశ్ రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 400 కోట్ల రూపాయలు ఏ మాత్రం సరిపోవని ఆయన అన్నారు. రైతు కష్టాల్లో ఉన్నప్పుడు యుపిఎ ప్రభుత్వం ఏనాడూ ఆదుకోలేదని ఆయన విమర్సించారు. గొప్పలు చెప్పుకుంటున్న యుపిఎ ప్రభుత్వ హయాంలో వ్యవసాయాభివృద్ధి 2.2 శాతం మాత్రమే ఉందని ఆయన అన్నారు. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ఈ ప్రభుత్వాలు రైతుల ఆగ్రహంలో కొట్టుకుపోతాయని ఆయన హెచ్చరించారు. గరీబీ హటావో నినాదం ఇచ్చిన కాంగ్రెసు ఇప్పుడు కిసాన్ హటావో నినాదంతో పనిచేస్తోందని తెలుగుదేశం రాజ్యసభ హరికృష్ణ అన్నారు.
గుంటూరు సభలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మారండీ మాట్లాడారు. ఈ సభకు పెద్దయెత్తున ప్రజలు హాజరయ్యారు. సిపిఎం నేత ప్రకాష్ కారత్, ఆర్ఎల్డీ నేత అజిత్ సింగ్, ఐఎన్ఎల్ఎండి నేత ఓం ప్రకాష్ చౌతాలా, సిపిఐ నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.