గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైతుకోసం బహిరంగ సభకు సిద్ధమైన గుంటూరు కెబి స్టేడియం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telugudesam
గుంటూరు: రాష్ట్రంలోని రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడానికి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహిస్తున్న రైతుకోసం బహిరంగ సభకోసం గుంటూరులోని కెబి స్టేడియం సిద్ధమవుతోంది. బహిరంగ సభ ఏర్పాట్లలో తెలుగు తమ్ముళ్లు మునిగి పోయారు. పలువురు శాసనసభ్యులు, సీనియర్ నాయకులు అక్కడే ఉండి పనులను పరీశీలిస్తున్నారు. అయితే ఈ సభ ద్వారా కేవలం రాష్ట్రంలోనే కాకుండా జాతీయస్థాయిలో కేంద్రంపై ఉద్యమానికి తెలుగుదేశం సమాయత్తమవుతోంది.

10 జాతీయ పార్టీ నేతలు ఈ రైతుకోసం బహిరంగ సభలో పాల్గొననున్నారు. మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ, ఎండిఎంకే నేత గణేష్ మూర్తి, జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ, సురవరం సుధాకర్ రెడ్డి, అజిత్ సింగ్, ఓంప్రకాశ్ చౌతాలా, ప్రకాశ్ కారత్ లు పాల్గొననున్నారు. చంద్రబాబునాయుడు చివరగా ప్రసంగిస్తారు. కాగా సభ మధ్యాహ్నం జరగవలసి ఉండగా ఎండ దృష్ట్యా మరికొన్ని కారణాల దృష్ట్యా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవనున్నట్టు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X