హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమైక్యాంధ్రను సీమాంధ్రలో పిడికెడు మందే కోరుతున్నారు: కెసిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: పిడికెడు మంది తప్ప ఆంధ్రలో సమైక్యాంధ్ర కావాలని ఎవరూ కోరుకోవడం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం అన్నారు. సీమాంధ్రలో ఎక్కువమంది తెలంగాణకే అనుకూలంగా ఉన్నారన్నారు. ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టాలని ఆయన కోరారు. ప్రభుత్వం బిల్లును ప్రవేశ పెట్టి హామీ నిలబెట్టుకోవాలని కోరారు.

కేంద్రం తెలంగాణకు కొత్తగా ఇచ్చేది ఏమీ లేదని, గతంలో ఇచ్చిన హామీనే నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు. కేంద్రం తన హామీని నిలబెట్టుకోకుంటే ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు పోతుందన్నారు. వాళ్ల ప్రాంతంలోనే రాజధానిని ఏర్పాటు చేసుకొని అక్కడే అభివృద్ధి చేసుకొవాలని ఆంధ్రా ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు మేరకు వచ్చిన మిగులు జలాల నీరు తెలంగాణకే కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అందులో 100 టిఎంసీల నీటిని మహబూబ్ నగర్ కు కేటాయించాలని ఆయన సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X